
-
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ సంచలన ప్రకటన
-
కాంగ్రెస్కు భారీ షాక్
న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ ప్రస్తుతం దేశంలో తిరుగులేని శక్తిగా ఉందని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చే వ్యాఖ్యలు చేశారు. భారత దేశంలో బీజేపీ ప్రభావాన్ని, ప్రధాని నరేంద్ర మోదీ బలాన్ని రాహుల్ గాంధీ అవగాహన చేసుకోలేకపోతున్నారని.. ఆయనతో ఉన్న ప్రధాన సమస్య అదే అని అంటున్నారు ప్రశాంత్ కిశోర్. ఈ వ్యాఖ్యలను బట్టి ఇన్ని రోజులూ కాంగ్రెస్లో కీలక పదవిని ప్రశాంత్ కిషోర్ చేపడతారనే వాదన బలంగా వినిపించగా.. ఇప్పుడే అందరికీ అనుమానాలు మొదలయ్యాయి. గోవాలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
భారత రాజకీయాల్లో భారతీయ జనతా పార్టీ మరికొన్ని దశాబ్దాల పాటు కేంద్రంగా ఉంటుందని ప్రశాంత్ కిశోర్ అన్నారు. కాంగ్రెస్ సహా ప్రతిపక్ష పార్టీలు భావిస్తున్నట్టు నరేంద్రమోదీని కానీ బీజేపీని కానీ ప్రజలు వదులుకోవడం జరగదని.. బీజేపీ ప్రభావం ఇంకో 30-40 ఏళ్ల వరకైనా ఉంటుందని ఆయన అన్నారు. ఈ విషయాన్ని కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ గ్రహించడం లేదని అదే అసలు సమస్య అని ప్రశాంత్ కిశోర్ అభిప్రాయపడ్డారు. భారత రాజకీయాలను మరికొన్ని దశాబ్దాల పాటు బీజేపీ ప్రభావితం చేస్తుందని.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నుంచి 40 ఏళ్ల పాటు కాంగ్రెస్ ఎలా ప్రభావితం చేసిందో బీజేపీ మరికొన్ని దశాబ్దాల పాటు అలాంటి స్థానంలోనే ఉంటుందని తేల్చి చెప్పారు.
Source: NationalistHub





