News

నకిలీ ఫేస్బుక్ అకౌంట్ తో వ్యక్తిని కేసులో ఇరికించిన అబ్దుల్ హుయేజ్, అబ్దుల్ తుయేజ్ లు – అకారణంగా రెండేళ్ళ జైలు శిక్ష అనుభవించిన అమాయకుడు

924views

రీష్ బంగెరా అనే భారతీయుడు రెండు సంవత్సరాల పాటు సౌదీ అరేబియాలోని జైలులో నిర్బంధించబడ్డాడు. కర్ణాటకలోని ఉడిపి జిల్లా కుందాపూర్ సమీపంలోని బీజడి గ్రామానికి చెందిన హరీష్ బంగెరా 2014 నుంచి సౌదీ అరేబియా లో ఏసీ టెక్నీషియన్ గా పనిచేస్తూ ఉండినాడు. డిసెంబర్ 2019లో అతని ఫేస్బుక్ అకౌంట్ లో మక్కా మరియు సౌదీ రాజులపై కొన్నిఅభ్యంతరకర వ్యాఖ్యలు పోస్ట్ చేయబడ్డాయి. దాంతో సౌదీ అరేబియా పోలీసులు బంగెరాను అరెస్టు చేశారు. అతను పనిచేస్తున్న కంపెనీ అతడ్ని ఉద్యోగంలోంచి తొలగించింది.

జరిగిన ఘటనతో ఆవేదనకు, ఆందోళనకు గురైన బంగెరా భార్య శ్రీమతి సుమన అసలు తన భర్తకు ఫేస్బుక్ అకౌంటే లేదని పేర్కొంటూ ఉడిపి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దాంతో ఉడిపి పోలీసులు ఘటనపై దర్యాప్తు ప్రారంభించారు. దర్యాప్తులో అబ్దుల్ హుయేజ్, అబ్దుల్ తుయేజ్ అనే ఇద్దరు ముస్లిం యువకులే హరీష్ బంగెరా పేరుతో ఒక నకిలీ ఫేస్బుక్ అకౌంట్ ను ప్రారంభించి అందులో పైన పేర్కొన్న విధంగా అభ్యంతరకర అంశాలను పోస్ట్ చేశారని తేలింది. దాంతో పోలీసులు హుయేజ్, తుయేజ్ లనిద్దరినీ అరెస్టు చేశారు.

నిజం నిర్ధారణ కావడంతో సౌదీ జైలు నుంచి విడుదలైన హరీష్ బంగెరా ఆగస్టు 17 న తిరిగి వచ్చాడు. బంగెరా విడుదలను పురస్కరించుకుని కేంద్ర వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీమతి శోభా కరండ్లాజే ” ప్రియమైన హరీష్ బంగెరాకు స్వాగతం. మేము ఎప్పటికీ నీతోనే ఉన్నాము. థాంక్యూ జయశంకర్ సర్.” అని ట్వీట్ చేశారు.

Source : Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.