News

చిత్తూరు జిల్లాలో భూకంపం.. భయంతో పరుగులు తీసిన జనం

138views

చిత్తూరు: చిత్తూరు జిల్లా పలమనేరు ప్రాంతంలో భూమి స్వల్పంగా కంపించింది. గంటాఊరు మండలంలో కొన్ని సెకండ్ల పాటు వచ్చిన ప్రకంపనలకు.. జనం భయాందోళనలకు గురయ్యారు. గంగవరం మండలం కీలపట్ల, బండమీద జరావారిపల్లి, కురప్పల్లి, గాంధీనగర్, నలసానిపల్లి ప్రాంతాల్లో 15 నిముషాల వ్యవధిలో మూడుసార్లు కంపించింది. భయంతో ఇళ్ళనుంచి బయటకు పరుగులు తీసిన జనం బిక్కుబిక్కుమంటూ రోడ్లపై గడిపారు. ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని ఆందోళన వ్యక్తం చేశారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలికి చేరుకొని కారణాలను అన్వేషిస్తున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి