167
ఉయ్యూరు: దేశ స్వాతంత్య్ర సాధనలో గిరిజన పోరాట యోధుడు బిర్సాముండా త్యాగం మరువలేనిదని జిల్లా గిరిజన సంక్షేమ శాఖాధికారి ఎం.ఫణిదూర్జటి అన్నారు. గిరిజన గౌరవ దివాస్ కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఉయ్యూరు గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో నిర్వహించిన బిర్సా ముండా జయంతి వేడుకల్లో ఆయన ముఖ్యఅతిథిగా హాజరై, బిర్సాముండా చిత్రపటానికి నివాళులర్పించారు. వనవాసీ కల్యాణ ఆశ్రమ రాష్ట్ర సహాయ కార్యదర్శి డాక్టర్ జి.సుందరావు, గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ కృష్ణమోహన్, జిల్లా కార్యాలయ సూపరింటెండెంట్ శివకుమార్, వసతి గృహ సంక్షేమాధికారిణి వాసవి మురళీ, వనవాసీ కల్యాణ ఆశ్రమ నగర కార్యదర్శి కాశీవిశ్వనాథ్ తదితరులు పాల్గొన్నారు.
Source: Eenadu