News

గుజరాత్ మోర్బీ బ్రిడ్జి దుర్ఘటనతో జో బైడెన్‌, కమలా హారిస్‌ సంతాపం

342views

వాషింగ్టన్‌: గుజరాత్‌లో మోర్బీ వంతెన కూలిన ఘటనపై అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ సంతాపం వ్యక్తం చేశారు. ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. ఈ కష్ట సమయలో తాము భారతీయులకు అండగా నిలుస్తామని తెలిపారు. వంతెన కూలిన సమయంలో ప్రియమైన వారిని కోల్పోయిన బాధిత కుటుంబాలకు గుజరాత్‌ ప్రజలతో కలిసి సంతాపం తెలుపుతున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు బైడెన్‌ ట్వీట్‌ చేశారు. అదే విధంగా గుజరాత్‌ దుర్ఘటనపై అమెరికా వైఎస్‌ ప్రెసిడెంట్‌ కూడా స్పందించారు. ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన  బాధిత కుటుంబాలకు సంతాపం వ్యక్తం చేస్తున్నట్టు ప్రకటించారు. తమ హృదయాలు భారత్‌తో ఉన్నాయని, క్లిష్ట పరిస్థితుల్లో భారతీయులకు మద్దతుగా ఉంటామని తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి