
363views
కశ్మీర్: కశ్మీర్ వేర్పాటువాద నేత అల్తాఫ్ అహ్మద్ షా మృతి చెందాడు. ఢిల్లీ ఎయిమ్స్లో చికిత్స పొందుతూ మంగళవారం.. అల్తాఫ్ తుదిశ్వాశ విడిచాడు. ఉగ్రవాదులకు నిధుల సమకూర్చిన కేసులో ఐదేళ్ళుగా తిహాడ్ జైలులో శిక్ష అనుభవిస్తున్నాడు. అతడి మరణవార్తను కుమార్తె రువాషా ట్విట్టర్ ద్వారా వెల్లడించింది. గత కొంతకాలంగా అల్తాఫ్ క్యాన్సర్తో బాధపడుతున్నాడు.
అంతకుముందు మెరుగైన వైద్యం కోసం అల్తాఫ్ను ఎయిమ్స్కు తరలించాలని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. తన తండ్రికి తక్షణ వైద్య సహాయం అందించాలని కోరుతూ రువాషా భారత ప్రధాని నరేంద్ర మోదీకి సైతం లేఖ రాసింది. జమ్ముకశ్మీర్ వేర్పాటువాద నేత సయ్యద్ అలీ షా గిలానీకి.. అల్తాఫ్ స్వయానా అల్లుడు. ఉగ్రవాదులకు నిధులు అందిస్తున్నారనే ఆరోపణలతో 2017లో అల్తాఫ్ అరెస్ట్ అయ్యాడు.





