129
భాగ్యనగరం: తిరుమలలో స్వామివారికి జరిగే నిత్యసేవలన్నీ సామాన్య భక్తులకు, నగర ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ నిర్ణయించింది. ఈ మేరకు ఈ నెల 11 నుంచి 15 వరకు హైదరాబాద్లోని ఎన్టీఆర్ స్టేడియంలో తిరుమల తిరుపతి దేవస్థానం వారు శ్రీ వెంకటేశ్వర వైభవోత్సవాలు జరపనున్నారు. వైభవోత్సవాలలో ప్రజలకు ఉచితంగా శ్రీవారిని దర్శించుకునే అవకాశాన్ని కల్పిస్తున్నట్టు అధికారులు తెలిపారు. ఐదు రోజులు కళాకారులతో సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఐదు రోజుల పాటు సుప్రభాత సేవతో ప్రారంభమయ్యే వైభవోత్సవాలు 15వ తేదీన శ్రీ వారి కళ్యాణంతో ముగియనున్నాయి.