
162views
-
దేశవ్యాప్తంగా అమలు చేసేందుకు ఏర్పాట్లు
న్యూఢిల్లీ: వృథాగా వెళ్ళే నీటిని మార్కెట్లో వినియోగ వస్తువుగా మార్చడానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమవుతోంది. సంబంధిత విధాన రూపకల్పనపై నీతి ఆయోగ్ కసరత్తులు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ప్రస్తుతం కమోడిటీ ఎక్స్ఛేంజ్ల్లో బంగారం, వెండి, ముడిచమురును విక్రయిస్తున్నట్టుగానే వృథా నీటి వ్యాపారం కూడా ప్రారంభిస్తే ఎలా ఉంటుందన్న ఆలోచనకు కార్యరూపం ఇచ్చే పనికి నీతి ఆయోగ్ శ్రీకారం చుట్టింది. ఇప్పటికే మహారాష్ట్రలో ఈ విధానం ఉండగా దాన్ని దేశవ్యాప్తంగా అమలుచేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా ప్రపంచవ్యాప్తంగా వివిధ దేశాలు అనుసరిస్తున్న కొలమానాలపై అధ్యయన ప్రక్రియను ప్రారంభించింది.