
వరికుంటపాడు: ఏపీలోని నెల్లూరు జిల్లా, వరికుంటపాడు గ్రామంలో శ్రీ సీతారామ స్వామి గిరిజన కాలనీలో శ్రీ సీతారాముల దేవాలయం నిర్మాణానికి మంగళవారం భూమి పూజ జరిగింది. ఈ పనులకు శ్రీవాణి ట్రస్ట్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం ఆర్థిక సహాయం అందించనుండగా, సమరసత సేవా ఫౌండేషన్ సహకారం ఇవ్వనుంది.
రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1,342 దేవాలయాలను తిరుమల దేవస్థానం నిర్మించనుండగా, నెల్లూరు జిల్లాకు అయిదు దేవాలయాలు మంజూరు చేసింది.

ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సమరసత సేవా ఫౌండేషన్ నెల్లూరు జిల్లా దేవాలయం కమిటీ ప్రతినిధి జగన్నాథం, నెల్లూరు జిల్లా దేవాలయం కమిటీ అధ్యక్షుడు రాజేంద్ర, సమరసత సేవ ఫౌండేషన్ నెల్లూరు జిల్లా మహిళా కన్వీనర్ అంజమ్మ తదితరులు పాల్గొన్నారు. కాగా, రాష్ట్రంలో మొదట విడతగా 111 దేవాలయాల పనులకు భూమి పూజ జరిగినట్టు సమరసత సేవా ఫౌండేషన్ ప్రతినిధులు తెలిపారు.





