-
రూ.12 వందల కోట్ల విలువైన 322.5 కిలోల సరుకు స్వాధీనం
న్యూఢిల్లీ: దేశంలో మరో భారీ డ్రగ్స్ రాకెట్ను పోలీసులు చేధించారు. దాదాపు 322.5 కిలోల మాదకద్రవ్యాలను ఢిల్లీ పోలీసులు సీజ్ చేశారు. వీటిలో 312.5 కిలోల నిషేధిత మెథాంఫేటమిన్(మెథ్) ఉండటం గమనార్హం. దీంతోపాటు 10కేజీల హెరాయిన్ను పట్టుకున్నట్టు పోలీసులు వెల్లడించారు. ఈ డ్రగ్స్ విలువ రూ.1200కోట్లు ఉంటుందని అంచనా వేస్తున్నారు. కాగా, ఈ మాదకద్రవ్యాల దందాను విదేశీయులు నడిపిస్తున్నారు.
అఫ్గానిస్థాన్కు చెందిన ముస్తాఫా స్టానిక్జా (23), రహీముల్లా రహీమ్ (44) 2016 నుంచి భారత్లో ఉంటున్నారు. అప్పటి నుంచే డ్రగ్స్ రాకెట్ను నడిపిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. విదేశాల్లో తయారుచేసిన ఈ మెథ్ను ఢిల్లీకి తీసుకువస్తున్నట్టు నిఘా వర్గాల నుంచి ఢిల్లీ పోలీసు ప్రత్యేక విభాగం అధికారులకు సమాచారం అందింది. దీంతో అప్రమత్తమైన అధికారులు. ఢిల్లీలోని కాలిందికుంజ్ మెట్రో స్టేషన్ వద్ద ఆ ట్రక్ను స్వాధీనం చేసుకొని వీరిద్దరినీ అరెస్టు చేశారు.