
377views
విజయవాడ: రాష్ట్రంలో ఎనిమిది ప్రధాన ఆలయాల్లో ఆన్లైన్ సేవలను ప్రారంభించనున్నట్టు ఏపీ దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ వెల్లడించారు. కాణిపాకం, శ్రీశైలం, ఇంద్రకీలాద్రి, అన్నవరం, పెనుగంచిప్రోలు, సింహాచలం, వాడపల్లి, అయినవిల్లి ఆలయాల్లో ఈ నెల 20 నుంచి ఆన్లైన్ సేవల్ని అందుబాటులోకి తీసుకురానున్నట్టు తెలిపారు.
భక్తుల రద్దీ అధికంగా ఉండే మరో 10 ఆలయాల్లోనూ ఆన్లైన్ సేవలు కల్పించాలని భావిస్తున్నట్టు చెప్పారు. అక్టోబర్ 10న ధార్మిక పరిషత్ తొలి సమావేశం జరుగుతుందన్నారు. ఇంద్రకీలాద్రిలో దసరా ఉత్సవాలకు ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయని.. ఉచిత, రూ.300 దర్శనాలకు వచ్చేవారికి ఘాట్ రోడ్డు ద్వారా అనుమతించనున్నట్టు మంత్రి వెల్లడించారు. సాధారణ భక్తులకు ఇబ్బంది లేకుండా వీఐపీల కోసం ప్రత్యేక టైం స్లాట్ని కేటాయిస్తున్నామన్నారు.





