156
న్యూఢిల్లీ: కాల్పుల విరమణ ఒప్పందానికి పాకిస్తాన్ మరోసారి తూట్లు పొడిచింది. పాక్ రేంజర్లు జమ్మూకశ్మీర్లోని అంతర్జాతీయ సరిహద్దు వెంబడి ఆర్నియా సెక్టార్ వద్ద భారత సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) బలగాలను లక్ష్యంగా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. అయితే, దీనికి తమ బలగాలు గట్టి సమాధానం ఇచ్చినట్టు బీఎస్ఎఫ్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఎస్పీఎస్ సంధూ తెలిపారు. ఉభయపక్షాల మధ్య కొద్దిసేపు కాల్పులు జరిగినా, భారతీయులెవరికీ ప్రాణనష్టం సంభవించలేదని వివరించారు. ఘటన జరిగిన వెంటనే సీనియర్ అధికారులు సరిహద్దు సమీపంలోని చినాజ్ ఔట్పోస్ట్ వద్దకు చేరుకుని, పరిస్థితిని సమీక్షిస్తున్నట్టు చెప్పారు.