
216views
కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన పిలుపు మేరకు ఆజాదీకా అమృతోత్సవాన్ని తితిదే ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించనున్నామని తితిదే ఈవో ఏవీ ధర్మారెడ్డి తెలిపారు. తితిదే అన్ని కార్యాలయాలు, ఉద్యోగుల ఇళ్లపై జాతీయ పతాకాన్ని ఎగురవేయాలని ఆదేశించామని చెప్పారు. దీంతోపాటుగా తిరుపతిలోని తితిదే పరిపాలన భవనం నుంచి ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న మహాత్మాగాంధీ విగ్రహం వరకు తితిదే ఉద్యోగుల ఆధ్వర్యంలో అజాదీకా అమృతోత్సవ్ భారీ ర్యాలీని నిర్వహించనున్నట్లు చెప్పారు.