News

వ‌చ్చే 8 నుంచి శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

265views
  • ఒకటి నుంచి అందుబాటులో టికెట్లు

తిరుప‌తి: భక్తుల సౌకర్యార్థం శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాల టికెట్లను టీటీడీ ఆగస్టు ఒకటిన ఉదయం 10గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. దాదాపు 600 టికెట్లను అందుబాటులో ఉంచనుంది. టిక్కెట్‌ ధర ఒకరికి రూ.2,500గా నిర్ణయించింది. పవిత్రోత్సవాలు ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న విషయం తెలిసిందే. మూడ్రోజుల పాటు జరిగే స్నపన తిరుమంజ‌నం, చివ‌రిరోజు పూర్ణాహుతిలో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి