
265views
-
ఒకటి నుంచి అందుబాటులో టికెట్లు
తిరుపతి: భక్తుల సౌకర్యార్థం శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాల టికెట్లను టీటీడీ ఆగస్టు ఒకటిన ఉదయం 10గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. దాదాపు 600 టికెట్లను అందుబాటులో ఉంచనుంది. టిక్కెట్ ధర ఒకరికి రూ.2,500గా నిర్ణయించింది. పవిత్రోత్సవాలు ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకు శ్రీవారి ఆలయంలో నిర్వహించనున్న విషయం తెలిసిందే. మూడ్రోజుల పాటు జరిగే స్నపన తిరుమంజనం, చివరిరోజు పూర్ణాహుతిలో పాల్గొనే అవకాశం కల్పించనున్నారు.