News

ప్రముఖ జర్నలిస్ట్ జుబైర్​కు బెయిల్

265views

న్యూఢిల్లీ: ప్రముఖ జర్నలిస్ట్, ఆల్ట్ న్యూస్ సహ వ్యవస్థాపకుడు మహమ్మద్ జుబైర్​కు సుప్రీంకోర్టు భారీ ఊరట కల్పించింది. ఆయనపై ఉత్తర్​ప్రదేశ్​లో ఆరు ఎఫ్ఐఆర్​లు నమోదు కాగా.. అన్ని కేసుల్లో బెయిల్ మంజూరు చేసింది. రూ.20వేల బెయిల్ బాండును పూచీకత్తుగా సమర్పించాలని జుబైర్​ను ఆదేశించింది. దీంతో జైలు నుంచి విడుదలయ్యే అవకాశం జుబైర్​కు లభించింది.

జుబైర్​పై యూపీలో నమోదైన కేసులన్నింటినీ ఢిల్లీ పోలీసు స్పెషల్ విభాగానికి బదిలీ చేస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. జుబైర్ ట్వీట్లపై దర్యాప్తు చేసేందుకు ఉత్తర్​ప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సిట్​ను రద్దు చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి జుబైర్​పై ప్రస్తుతం నమోదైన కేసులతో పాటు భవిష్యత్​లో నమోదయ్యే ఎఫ్ఐఆర్​లు సైతం ఢిల్లీకి బదిలీ అవుతాయని స్పష్టం చేసింది. తనపై నమోదైన ఎఫ్ఐఆర్​లను రద్దు చేయాలని ఢిల్లీ హైకోర్టును జుబైర్ ఆశ్రయించవచ్చని సుప్రీం తెలిపింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి