
335views
కశ్మీర్: టిబెట్ ఆధ్యాత్మిక గురువు దలై లామా రెండు రోజులపాటు జమ్ముకాశ్మీర్, లద్దాఖ్ల్లో పర్యటించనున్నారు. ఈ మేరకు గురువారం మధ్యాహ్నం ఆయన బయలుదేరారు. దాదాపు రెండేళ్ళ తర్వాత దలై లామా తొలి అధికారిక పర్యటన ఇది. కొవిడ్ కారణంగా రెండేళ్ళపాటు ధర్మశాలలోని బౌద్ధాశ్రమానికే ఆయన పరిమితమయ్యారు. కాగా, కాశ్మీర్లోని తిక్సే మఠాన్ని ఆయన సందర్శించనున్నారని సమాచారం. కాగా దలైలామా పర్యటనపై చైనా ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి.





