
402views
కోలంబో: శ్రీలంక అధ్యక్షుడు గొటబయ రాజ పక్షే మాల్దీవుల నుంచి కూడా పరారయ్యారు. తన కుటుంబంతో సహా ఆయన సింగపూర్ చేరుకున్నారు. సౌదీ ఎయిర్లైన్స్ విమానంలో ఆయన సింగపూర్ చేరుకున్నారు. మాల్దీవుల్లో కూడా శ్రీలంక జాతీయులు ఆందోళనకు దిగడంతో ఆయనకు మరో గత్యంతరం లేకుండా పోయింది. అయితే, రాజపక్షే తమను ఆశ్రయం కోరలేదని, ప్రైవేట్ పర్యటనలో భాగంగా వచ్చారని సింగపూర్ విదేశాంగ శాఖ స్పష్టం చేసింది.





