
460views
న్యూఢిల్లీ: అఫ్గాన్ ప్రజలకు ఎల్లప్పుడూ సంఘీభావంగా ఉంటామని భారత్ పేర్కొంది. అఫ్గాన్కు రెండు విమానాల ద్వారా 27 టన్నుల సహాయ సామగ్రిని పంపించినట్టు భారత విదేశీ వ్యవహారాలశాఖ (ఎంఈఏ) వెల్లడించింది. అందులో అత్యవసర వస్తువులైన టెంట్లు, దుప్పట్లు, నిద్రపోవడానికి ఉపయోగపడే చాపలు ఉన్నాయని తెలిపింది. ఈ సామగ్రిని కాబూల్లోని ఐక్యరాజ్యసమితికి చెందిన మానవతా వ్యవహారాల సమన్వయ సంస్థ (యూఎన్ఓసీహెచ్ఏ)కు, అఫ్గాన్ రెడ్ క్రీసెంట్ సొసైటీ (ఏఆర్సీఎస్)కి అందజేయనున్నట్టు ఎంఈఏ ఓ ప్రకటనలో తెలిపింది.





