
575views
న్యూఢిల్లీ: భారత్లో తయారు చేసిన సైనిక వాహనాలను ఇండియన్ ఆర్మీలో ప్రవేశ పెట్టారు. ఈ ఇన్ఫాంట్రీ కాంబాట్ వెహికల్స్ను చాలా సులభంగా డ్రైవ్ చేయొచ్చని సైన్యం తెలిపింది. డ్రైవర్ 1,800 మీటర్ల దూరం వరకు చూడగలుగుతారని వెల్లడించింది. వాహనంలో కూర్చొనే బయట ఉండే ఆయుధాలను ఆపరేట్ చేయొచ్చని నార్తరన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది తెలిపారు. ఈ వాహనాలను డీఆర్డీఓ, టాటా గ్రూప్ ఉమ్మడిగా డిజైన్ చేశాయి.





