News

దేవాల‌యంలో అప‌రిశుభ్ర‌త‌పై క‌లెక్ట‌ర్ త‌క్ష‌ణ చ‌ర్య‌లు

218views

రాజ‌మ‌హేంద్ర‌వ‌రం: కోనసీమ జిల్లాలోని పంచారామ క్షేత్రం ద్రాక్షారామం శ్రీ మాణిక్యాంబా సమేత శ్రీ భీమేశ్వర స్వామివారిని అమ్మవారిని కలెక్టర్ హిమాన్షు శుక్లా దర్శించుకున్నారు. స్వామివారి దర్శనానంతరం ఆలయాల పరిసరాలను పరిశీలిస్తున్న సమయంలో కలెక్టర్ హిమాన్షు దృష్టి ఆలయం లో అపరిశుభ్రంగా ఉన్న సీలింగ్ ఫ్యాన్ పై పడింది. దీంతో వెంటనే స్పందించిన ఆయన ఆలయ సిబ్బందిని పిలిచి తక్షణ చర్యలు తీసుకున్నారు. జిల్లా ఎండోమెంట్ ఆఫీసర్, ద్రాక్షరామ దేవస్థానం ఇన్చార్జి ఈవో డివి ప్రసాద్ స్వయంగా సీలింగ్ ఫ్యాన్ ను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ తన సెన్సాఫ్ హ్యూమర్‌ని చూపిస్తూ.. గుడిలో ఫ్యాను బిగించినప్పటినుండి ఇప్పుడే తుడుస్తున్నారంటూ సరదాగా కామెంట్ చేశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి