342
* అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల్లో పాల్గొనటానికే…
మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు జయంతి వేడుకల సందర్భంగా జులై 4న ప్రధాని మోడీ పశ్చిమగోదావరి జిల్లా భీమవరం వస్తారని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు ప్రకటించారు. ఓ శుభకార్యంలో పాల్గొనేందుకు ఆకివీడు వచ్చిన ఆయన స్థానిక నాయకులతో మాట్లాడారు. జూన్ 7న రాజమహేంద్రవరంలో జరగనున్న బహిరంగ సభలో భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా పాల్గొంటారని తెలిపారు. ఈ సందర్భంగా అనుసరించాల్సిన విధివిధానాలపై నాయకులు, కార్యకర్తలకు వీర్రాజు పలు సూచనలు చేశారు.