News

నేపాల్ : విమానం గల్లంతు

539views

* విమానంలో నలుగురు భారతీయులు

నేపాల్‌లో ఓ విమానం ఆచూకీ గల్లంతైంది. ప్రైవేట్‌ ఎయిర్‌లైన్‌కు చెందిన తారా ఎయిర్‌9 విమానం ఆదివారం పఖోరా నుంచి జోమ్‌సమ్‌కు వెళ్తున్న సమయంలో రాడార్‌తో సంబంధాలు తెగిపోయాయి. రెండు ఇంజిన్లు కలిగిన ఈ విమానంలో మొత్తం 22 మంది ఉండగా.. వీరిలో నలుగురు భారతీయులని సమాచారం. జెమ్‌సమ్‌ ప్రాంతంలోని ముస్తాంగ్‌ జిల్లాలోని గగనతలంలో చివరగా విమానం కనిపించిందని.. ఆ తర్వాత విమానంతో సంబంధాలు తెగిపోయాయని అధికారులు తెలిపారు. విమానం ఆచూకీ కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.