News

జమ్మూ-కశ్మీర్​లో మోడీ పర్యటనపై విషం కక్కిన పాకిస్తాన్

552views

న్యూఢిల్లీ: జమ్మూ-కశ్మీర్​లో ప్రధాని మోదీ పర్యటించి పలు అభివృద్ధి ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయడంపై పాకిస్థాన్‌ అభ్యంతరం వ్యక్తం చేసింది. అక్కడ పరిస్థితులు సజావుగా ఉన్నట్టు నమ్మించడానికి వేసిన మరో ఎత్తుగడగా పాక్‌ విదేశాంగ శాఖ అభివర్ణించింది.

2019 ఆగస్టులో జమ్మూ-కశ్మీర్​లో ఆర్టికల్‌ 370ని రద్దు చేసిన అనంతరం మోదీ తొలిసారిగా ఆదివారం అక్కడ పర్యటించారు.. ఈ సందర్భంగా చీనాబ్‌ నదిపై రెండు జల విద్యుత్‌ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేశారు. దీన్ని కూడా పాక్‌ తప్పుపట్టింది.

ఆ ప్రాజెక్టులపై పాక్‌కు ఆభ్యంతరాలున్నాయని, వాటికి సంబంధించిన సమాచారాన్ని భారత్‌ తమతో పంచుకోలేదని పేర్కొంది. అక్కడ శంకుస్థాపనలు చేయడం ద్వారా భారత్‌ సింధు జలాల ఒప్పందాన్ని ప్రత్యక్షంగా ఉల్లంఘించిందని వ్యాఖ్యానించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి