
561views
కాబూల్: ఆఫ్ఘనిస్తాన్లోని ఖోస్ట్ ప్రావిన్స్పై ఏప్రిల్ 15, శుక్రవారం రాత్రి పాకిస్థాన్ ఎయిర్ ఫోర్స్ వైమానిక దాడులను ప్రారంభించింది. ఈ మేరకు ఆఫ్ఘనిస్తాన్లోని స్థానిక అధికారులు ధ్రువీకరించారు. వైమానిక దాడిలో మహిళలు, పిల్లలతో సహా కనీసం 30 మంది మరణించారు.
ఖోస్ట్ ప్రావిన్స్లోని స్పుర్రా జిల్లాలోని ప్రాంతాలను పాకిస్థాన్ విమానాలు లక్ష్యంగా చేసుకున్నాయి. ఖోస్ట్ ప్రావిన్స్లోని స్పురా జిల్లాలోని మిర్పర్, మండే, షైదీ, కై గ్రామాలను పాకిస్తాన్ విమానాలు లక్ష్యంగా చేసుకున్నాయి. శుక్రవారం ఉదయం 9:00 గంటలకు, గోర్బ్జ్ జిల్లాలోని మాస్టర్బెల్ ప్రాంతంలో పాకిస్థాన్ సైనికులు తాలిబాన్ దళాలతో ఘర్షణ పడ్డారు.
Source: NationalistHub





