
జమ్ముకశ్మీర్: దేశ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న అయిదుగురు ప్రభుత్వ ఉద్యోగస్తులను జమ్ముకశ్మీర్ ప్రభుత్వం తొలగించింది. పోలీసు కానిస్టేబుల్ తౌసీఫ్ అహ్మద్ మీర్(పుల్వామా), కంప్యూటర్ ఆపరేటర్ గులాం హసన్ పర్రే(శ్రీనగర్), అవంతిపొరకు చెందిన అర్షిద్ అహ్మద్ దాస్(ఒక ఉపాధ్యాయుడు), పోలీసు కానిస్టేబుల్ షాహిద్ హుస్సేన్ రాథర్(బారాముల్లా & నర్సింగ్ ఆర్డర్లీ, ఆరోగ్య శాఖ), షరాఫత్ ఖాన్(కుప్వారా)ను తొలగించింది.
తౌసీఫ్ అహ్మద్ మీర్ ఉగ్రవాద సంస్థ హిజ్బ్-ఉల్-ముజాహిదీన్ కోసం చురుకుగా పనిచేస్తున్నాడు. అతని ఇద్దరు పోలీసు సహచరులను చంపడానికి కూడా ప్రయత్నించాడు. జూన్ 2017లో తౌసీఫ్ తీవ్రవాద సహచరులతో కలిసి ఒక ఎస్పీవోను చంపడానికి ప్రయత్నించాడు. తౌసీఫ్ తండ్రి అల్-జిహాద్ సంస్థలో తీవ్రవాది. అతను 1997లో ఎన్కౌంటర్లో మృతి చెందాడు. తౌసీఫ్ తదనంతరం పోలీసు దళంలో చేరాడు కానీ.. రహస్యంగా ఉగ్రవాద సంస్థ కోసం పనిచేయడం ప్రారంభించాడు.
2009లో పారింపోరాలో హింసాత్మక నిరసనను నిర్వహించినందుకు గులాం హసన్పై పోలీసులు కేసు నమోదు చేశారు. యువతను ఉగ్రవాద శ్రేణుల్లో చేరేలా ప్రేరేపించేందుకు వేర్పాటువాద గ్రూపులు గులాం హసన్కు బాధ్యతలు అప్పగించాయి.
అర్షిద్ అహ్మద్ జేఐ కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటున్నాడు. అతను హిజ్బ్-ఉల్-ముజాహిదీన్ ఉగ్రవాద సంస్థతో సన్నిహితంగా ఉంటూ ఉపాధ్యాయుడి ముసుగులో ఉగ్రవాద కార్యకలాపాలకు మద్దతు ఇచ్చాడు.
షాహిద్ హుస్సేన్ రాథర్ మొదట్లో 2005లో ఎస్పీవోగా ఎంపికయ్యాడు. అతని తీవ్రవాద కార్యకలాపాలు 2009లో మొదటిసారిగా వెలుగులోకి వచ్చాయి. అతన్ని అరెస్టు చేశారు. తదుపరి విచారణలో మరో ఏడుగురిని అరెస్టు చేసి, పెద్ద ఎత్తున ఆయుధాలు, మందుగుండు సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే షరాఫత్ ఖాన్ను పోలీసులు అరెస్టు చేశారు.
Source: VSK Bharat





