
702views
పశ్చిమ బెంగాల్: బెంగాల్లో మరోసారి హింస చెలరేగింది. బీర్భుమ్ జిల్లా రాంపుర్హట్ ప్రాంతంలో మంగళవారం కొందరు దుండగులు ఇళ్ళకు నిప్పుపెట్టగా ఎనిమిది మంది సజీవదహనమయ్యారు. మరో ఇద్దరు గాయపడినట్టు పోలీసులు తెలిపారు. అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమించి, మంటలను ఆర్పివేసినట్టు వివరించారు.
తృణమూల్ కాంగ్రెస్ నేత, బర్షాల్ గ్రామ పంచాయతీ డిప్యూటీ చీఫ్ బహదూర్ షేక్ను సోమవారం ఎవరో హత్యచేశారు. దీంతో రెచ్చిపోయిన ఆయన అనుచరులు. రాంపుర్హట్లోని అయిదు ఇళ్ళకు నిప్పుపెట్టారు. ఈ ఘటనలో మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్టు పోలీసులు తెలిపారు.
”ఈరోజు ఉదయం ఒకే ఇంటి నుంచి ఏడు మృతదేహాలను స్వాధీనం చేసుకున్నాం. అంతకుముందు 10 మంది చనిపోయారని వార్తలొచ్చాయి. అది నిజం కాదు. మొత్తం 8 మంది చనిపోయారు.”
– మనోజ్ మాలవీయ, బంగాల్ డీజీపీ
Source: EtvBharat





