News

75 ఏళ్ళ‌ తర్వాత కోలార్ క్లాక్ టవర్‌పై త్రివ‌ర్ణ ప‌తాకం రెప‌రెప‌లు!

648views
  • ఇప్పటివరకూ ఇస్లామిక్ ముసుగులో పాకిస్తాన్ జాతీయ జెండా ఎగుర వేసిన ద్రోహులు

బెంగ‌ళూరు: కర్ణాటక.. కోలార్‌లోని క్లాక్ టవర్‌పై తొలిసారిగా భారత జెండాను ఎగరేశారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య జిల్లా అధికారులు జెండా ఎగరేశారు. కోలార్‌లోని క్లాక్ టవర్‌కు దశాబ్దాల చరిత్ర ఉంది. దాదాపు 75 ఏళ్ళుగా ఈ టవర్ ఆకుపచ్చ రంగులోనే ఉంటుంది. అప్పట్నుంచి దీనిపై ఇస్లామిక్ జెండాలు ఎగురుతూనే ఉండేవి. అయితే, కొంతకాలంగా ఈ టవర్ విషయంలో వివాదం చెలరేగుతోంది.

టవర్ రంగు మార్చాలని, టవర్‌పై ఉన్న జెండాలను తొలగించి మూడు రంగుల భారత జెండా ఎగరేయాలని స్థానిక ఎంపీ మునిస్వామితోపాటు పలువురు డిమాండ్ చేశారు. దీంతో చాలాకాలంగా వివాదం నడిచింది. మునిస్వామి ఈ అంశంపై ఆందోళన నిర్వహించారు. ఈ వివాదం నేపథ్యంలో అక్కడ 144 సెక్షన్ విధించాల్సి వచ్చింది. చివరకు పోలీసుల భద్రత మధ్య టవర్‌కు తెలుపు రంగు వేశారు.

టవర్‌పై ఉన్న జెండాలను తొలగించిన అధికారులు మూడు రంగుల భారత పతాకాన్ని ఎగురవేశారు. ఈ నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో భద్రతా చర్యలు తీసుకున్నారు. ఇరువర్గాలతో చర్చలు జరిపి, వివాదం తలెత్తకుండా చూశారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి