News

హిందూ మహిళపై దారుణం.. భర్త మహ్మద్ ఇజాజ్ కొడ‌వ‌లితో దాడి!

746views

బెంగ‌ళూరు: కర్ణాటకలో మహ్మద్ ఇజాజ్ తన భార్య అపూర్వ పురాణిక్, అలియాస్ అర్ఫా భానుపై కొడవలితో దాడి చేశాడు. అతనికి అప్పటికే వివాహం అయిందని, ముగ్గురు పిల్లలకు తండ్రి అని తెలుసుకున్న తరువాత విడాకులు కోరిన ఆమెను దారుణంగా హింసించాడు. 30 ఏళ్ళ‌ మహ్మద్ ఇజాజ్ తన రెండో భార్య, 26 ఏళ్ల అపూర్వ పురాణిక్‌ను కొడవలితో 23 సార్లు నరికాడు. ఈ ఘటన కర్ణాటకలోని గడగ్ జిల్లాలో గురువారం చోటుచేసుకుంది. బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండడంతో నగరంలోని స్థానిక ఆస్పత్రిలో ప్రాణాలతో పోరాడుతోంది.

నిందితుడు ఇజాజ్ ఆటో డ్రైవర్‌. ఎంబీఏ గ్రాడ్యుయేట్ అయిన అపూర్వ పురాణిక్‌ను ప్రేమించినట్టు మాయ మాటలు చెప్పాడు. ఇజాజ్ తన చదువును కొనసాగిస్తున్నానని, ఖాళీ సమయాల్లో ఆటో డ్రైవర్‌గా పనిచేస్తున్నానని అపూర్వకు అబద్ధం చెప్పాడు. నిందితుడి వ‌ల‌లో ప‌డ్డ ఆ అమ్మాయి.. కుటుంబ సభ్యుల మాట‌లు లెక్క‌చేయ‌క ఇజాజ్‌ను 2018లో వివాహం చేసుకుంది.

వివాహం తర్వాత అపూర్వను ముస్లింగా మార్చారు. తన పేరును అర్ఫా భానుగా మారింది. బురఖా, హిజాబ్ ధరించడం వంటి ఇస్లామిక్ సంప్రదాయాలను అనుసరించింది. అపూర్వ మాంసాహారం కూడా తీసుకోవడం ప్రారంభించింది. ఇజాజ్ ఆమెను ఇస్లాంలోకి మారమని బలవంతం చేయడంతో హిందూ సంప్రదాయాలను పూర్తిగా విడిచిపెట్టింది. అపూర్వ కుటుంబం కూడా ఆమె కుమార్తెతో రాజీపడి, కుమార్తె, ఇజాజ్‌తో సత్సంబంధాలను కలిగి ఉంది.

ఆ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. కొన్ని నెలల తర్వాత, బ్రాహ్మణ కుటుంబానికి చెందిన అపూర్వకు ఇజాజ్ రహస్యం గురించి తెలిసింది. ఇజాజ్ తన మొదటి వివాహం గురించి సమాచారాన్ని దాచిపెట్టాడని తెలుసుకుంది. ఇజాజ్ అపూర్వతో పెళ్ళికి ముందే ముస్లిం మహిళను వివాహం చేసుకున్నాడు. ముగ్గురు పిల్లలకు తండ్రి అయ్యాడు. ఆమె ఇజాజ్ మొదటి వివాహం గురించి తెలుసుకున్నప్పుడు.

అపూర్వ ఇజాజ్‌ను విడిచిపెట్టి, తన రెండేళ్ళ కొడుకుతో పాటు గడగ్ జిల్లాలోని తన తల్లిదండ్రుల నివాసానికి వెళ్ళిపోయింది. ఇజాజ్ తనను హింసించడం ప్రారంభించడంతో ఆమె స్థానిక కోర్టులో విడాకుల కోసం దాఖలు చేసింది.

నాలుగు నెలలుగా ఆమె తన తల్లిదండ్రులతో ఉంటోంది. గురువారం నిందితుడు అపూర్వను చంపడానికి వచ్చాడు. అపూర్వ ద్విచక్ర వాహనం నడపడం నేర్చుకునేందుకు గ్రౌండ్‌కి వెళ్ళిన సమయంలో అక్కడికి చేరుకున్న ఇజాజ్.. ఆమెను వెంబడించి దాదాపు 23 సార్లు దాడి చేయడంతో ఆమె నేలపై కుప్పకూలిపోయింది. వెంటనే ఆమెను నగరంలోని స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఇంతలో, ఇజాజ్ సంఘటన స్థలం నుండి తప్పించుకోగలిగాడు. మహ్మద్ ఇజాజ్ కోసం గడగ్ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పుడామె కొనప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంది.

Source: NationalistHub

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి