
399views
విజయవాడ: ‘ది కశ్మీర్ ఫైల్స్’… కశ్మీరీ పండిట్ల కన్నీటి గాథను దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెరకెక్కించిన చిత్రం. 90వ దశకంలో కశ్మీరీలపై జరిగిన దాడులు.. వారిపై సాగిన హత్యాకాండకు సంబంధించిన కథాంశంతో రూపొందింది ఇది. శుక్రవారం విడుదలైన ఈ సినిమా అభిమానులను ఆకట్టుకుంటోంది. దీంతో పాటే ఓ ఘనతను అందుకుంది.
ప్రముఖ మూవీ రేటింగ్ సంస్థ ఐఎమ్డీబీలో అత్యధిక రేటింగ్ అందుకున్న చిత్రంగా నిలిచింది. 10/10 రేటింగ్ను అందుకుంది. కశ్మీర్లోని తీవ్రవాదులు, వేర్పాటువాదుల దాడుల వల్ల ఓ సామాజిక వర్గం ఎలా అంతమైందో ఈ సినిమాలో భావోద్వేగభరితంగా చూపించారు. కాగా, ఈ చిత్రంలో మిథున్ చక్రవర్తి, అనుపమ్ ఖేర్, దర్శన్ కుమార్, పల్లవి జోషి ప్రధాన పాత్రలు పోషించారు.