News

కేంద్ర ప్రభుత్వం ‘ఆపరేషన్ ఉక్రెయిన్‌’… త్వరలోనే వారంతా భారత్​కు!

568views

న్యూఢిల్లీ: రష్యా- ఉక్రెయిన్​ మధ్య సంఘర్షణ తీవ్రమవుతున్న నేపథ్యంలో ఉక్రెయిన్​లోని భారతీయులను స్వదేశానికి తీసుకొచ్చేందుకు ముమ్మర ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి. ఈ మేర‌కు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. భారత్​- ఉక్రెయిన్​ మధ్య విమాన సేవలను మరింత పెంచేందుకు పౌర విమానయాన శాఖ, వివిధ ఎయిర్​లైన్స్​తో సంప్రదింపులు జరుపుతున్నామని వివరించాయి.

భార‌త ప్ర‌భుత్వం ఉక్రెయిన్​లోని భారత రాయబార కార్యాలయం, విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యాలయంలో కంట్రోల్ రూమ్​లు ఏర్పాటు చేసి పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తోంది. ఉక్రెయిన్​లోని భారతీయులు, ముఖ్యంగా విద్యార్థులు స్వదేశానికి రావాల్సిందిగా భారత రాయబార కార్యాలయం నిన్న ఓ ప్రకటన విడుదల చేసింది.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి