News

అన్యాయంపై నిల‌దీస్తే అరెస్టులు… స్కూల్లో చిత్ర‌హింస‌లు పెడితే స‌త్కారాలు!

576views
  • ఇదీ లావ‌ణ్య కేసులో త‌మిళ‌నాడు స‌ర్కారు తీరు

చెన్నై: చెన్నైలో సీఎం ఎంకే స్టాలిన్ ఇంటి ముందు సోమవారం (ఫిబ్రవరి 14) నిరసనకు దిగిన అఖిల భారతీయ విద్యార్థి పరిషత్(ఏబీవీపీ) కార్యకర్తలు, నేత‌ల‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లావణ్యకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఏబీవీపీ జాతీయ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి నిధి త్రిపాఠితో పాటు మరో 40 మంది కార్యకర్తలు సిఎం నివాసం ముందు నిరసన వ్యక్తంచేయ‌డంతో అరెస్టు చేశారు. తమిళనాడు డీఎంకే ప్రభుత్వానికి, క్రిస్టియన్ మిషనరీలకు పెద్ద ఎదురుదెబ్బ తగిలిన లావణ్య ఆత్మహత్య కేసులో సీబీఐ విచారణకు మద్రాసు హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై స్టే విధించేందుకు సుప్రీంకోర్టు 14న నిరాకరించింది.

“ప్రభుత్వం సీబీఐకి సహకరించడం లేదు. వారు జాతీయ బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ కి కూడా సహకరించడం లేదు. వారు ఎందుకు సహకరించడం లేదు ? వారు రెండింటికీ సహకరించాలి” అని నిధి త్రిపాఠి డిమాండ్ చేశారు.

“మాకు ఒకే ఒక్క ప్రశ్న ఉంది. లావణ్య తండ్రి 25 ఏళ్ళుగా డీఎంకెలో సభ్యుడు. కానీ ఇప్పటి వరకు, వారు తమ సొంత కార్యకర్తలకు న్యాయం చేయలేకపోయారు. వారి నుండి మేము ఏమి ఆశించగలం?” అని కూడా ఆమె ప్రశ్నించింది. విద్యాసంస్థల్లో బలవంతపు మతమార్పిడుల‌ను నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నామని ఆమె అన్నారు.

ఇదిలావుండ‌గా, తిరుచ్చి సెంట్రల్ జైలులో నిర్బంధంలో ఉన్న సగయ మేరీ బెయిల్‌పై విడుదలైంది. డీఎంకే తిరుచ్చి తూర్పు ఎమ్మెల్యే ఇనిగో ఇరుదయరాజ్ ఆమెకు శాలువా కప్పి స్వాగతం పలికారు.

లావణ్య ఆత్మహత్య చేసుకున్న ఘటనపై నిధి త్రిపాఠి తమిళనాడు ముఖ్యమంత్రికి 9వ తేదీన లేఖ రాశారు. ఈ కేసు పట్ల తమిళనాడు ప్రభుత్వం అనుసరిస్తున్న సున్నితత్వాన్ని లేఖలో నిధి ఎత్తిచూపారు.

బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం నిధి త్రిపాఠి మాట్లాడుతూ, చిన్నారి కుటుంబం పడుతున్న కష్టాలు ఊహించలేనంత బాధాకరమన్నారు. “లావణ్య తమ్ముళ్ళ‌ను పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లారు, అక్కడ తమిళనాడు పోలీసు అధికారులు కేసును బలహీనపరిచేందుకు స్టేట్‌మెంట్లు ఇవ్వాలని ఒత్తిడి చేస్తున్నారు” అని నిధి ఎత్తి చూపారు.

Source: Organiser

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి