News

భాగ్య‌న‌గ‌రానికి ఎల్లుండి రానున్న ప్ర‌ధాని మోదీ

395views

న్యూఢిల్లీ: ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో పాల్గొనడం సహా.‌. సమతామూర్తి విగ్రహావిష్కరణ కోసం ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎల్లుండి హైదరాబాద్ రానున్నారు. ప్రత్యేక విమానంలో శనివారం మధ్యాహ్నం హైదరాబాద్ చేరుకుంటారు. పటాన్​చెరు సమీపంలోని ఇక్రిశాట్ స్వర్ణోత్సవాల్లో ప్రధాని మోదీ పాల్గొంటారు.

అనంతరం ముచ్చింతల్​కు వెళ్తారు. అక్కడ రామానుజచార్య సహస్రాబ్ది ఉత్సవాల్లో భాగంగా సమతామూర్తి విగ్రహాన్ని మోదీ ఆవిష్కరిస్తారు. ప్రత్యేక పూజల్లో పాల్గొంటారు. రాత్రికి తిరిగి దిల్లీ బయల్దేరి వెళ్తారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వానికి అధికారిక సమాచారం అందింది. ప్రధానమంత్రి పర్యటన నేపథ్యంలో అవసరమైన బందోబస్తు, ఇతర ఏర్పాట్లను రాష్ట్ర ప్రభుత్వం పటిష్ఠంగా చేస్తోంది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి