
-
ఆర్ఎస్ఎస్ సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్
అగర్తలా: శాంతిని ప్రేమించే దేశమైన భారతదేశం ప్రపంచ వ్యాప్తంగా సోదరభావం, సామరస్య సందేశాన్ని వ్యాప్తి చేస్తోందని రాష్ట్రీయ స్వయం సేవక సంఘ్(ఆర్ఎస్ఎస్) సర్ సంఘచాలక్ డాక్టర్ మోహన్ భాగవత్ తెలిపారు. అగర్తలాలో ఆయన బుధవారం రిపబ్లిక్ దినోత్సవం సందర్భంగా త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన విషయం విదితమే. ఈ సందర్భంగా భాగవత్ మాట్లాడారు.
ఈనెల 24తేదీ నుండి నాలుగు రోజుల పర్యటన కోసం త్రిపురలో ఉన్న భాగవత్, భారతదేశ జాతీయ జెండా పైభాగంలో ఉన్న కాషాయ రంగు ధైర్యం, త్యాగం, ఉత్సాహాన్ని వర్ణిస్తుందని చెప్పారు. దేశంలోని పురాతన రాజుల జీవితం, తాత్విక చింతనాలతో పాటు స్వాతంత్య్ర సమరయోధులలో కూడా అటువంటి గుణాలు కనిపిస్తాయని తెలిపారు.
డాక్టర్ భాగవత్ మన జాతీయ జెండాలోని ఆకుపచ్చ రంగు ప్రాముఖ్యతను దేవి లక్ష్మికి కట్టుబడి ఉన్న పురోగతికి చిహ్నంగా వివరించారు. “భారతదేశం పురాతన కాలం నుండి ఆధ్యాత్మిక దేశంగా ఉన్నందున, జెండా మధ్యలో ఉన్న ధర్మచక్రం భారతదేశ ప్రజలు అనుసరించిన, ఆచరిస్తున్న సామాజిక-సాంస్కృతిక తత్వశాస్త్రం ప్రాముఖ్యతను వర్ణిస్తుంది” అని చెప్పారు.
Source: Nijamtoday





