
75views
-
గతంలో కంటే ఘనంగా ముగింపు వేడుకలకు సన్నాహాలు
న్యూఢిల్లీ: ఈ గణతంత్ర వేడుకల ముగింపునకు చిహ్నంగా నిర్వహించే బీటింగ్ రీట్రీట్ వేడుకను ఘనంగా నిర్వహించాలని కేంద్రం భావిస్తోంది. దిల్లీలోని విజయ్చౌక్లో ఈనెల 29న జరిగే వేడుక కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. తొలిసారిగా డ్రోన్లు, లేజర్ షో ఏర్పాటు చేస్తోంది. ఈ నేపథ్యంలో దేశంలో తయారు చేసిన వెయ్యి డ్రోన్లతో అభ్యాసాలు చేస్తున్నారు. డ్రోన్లు, లేజర్ షోల విద్యుత్ కాంతులతో పలు ఆకృతులను రూపొందించనున్నారు.