
582views
కర్ణాటకలోని హెడిగొండకు చెందిన వసీం అక్రమ్, లోన్ కోసం స్థానిక కెనరా బ్యాంకుకు వెళ్లాడు. పలు కారణాల వల్ల బ్యాంకు అతడికి లోన్ రాదని తేల్చి చెప్పింది. కోపంతో రగిలిపోయిన వసీం బ్యాంకు అద్దాలు పగులగొట్టి పెట్రోల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో బ్యాంకులోని ఫర్నిచర్, కంప్యూటర్ల తోపాటు పలు కీలక డాక్యుమెంట్లు కాలిపోయాయి. దీంతో స్థానికులు వసీంను పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.





