
515views
తిరుపతి: తిరుమలలో రేపటి నుంచి స్థానికులకు స్వామి వారి ఉచిత దర్శన టికెట్లను తిరుమల తిరుపతి దేవస్థానం పంపిణీ చేయనుంది. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని ఈ దర్శన టికెట్లను పంపిణీ చేయాలని నిర్ణయించింది. ఈ నెల 13 నుంచి 22 వరకు రోజుకు అయిదు వేల చొప్పున 50వేల టికెట్లను జారీ చేయనుంది.
రేపు ఉదయం తొమ్మిది గంటల నుంచి దేవస్థానం ఈ టికెట్లను జారీ చేయనుండగా తిరుపతిలోని శ్రీరామచంద్ర పుష్కరిణి, ముత్యాలరెడ్డిపల్లి, సత్యనారాయణపురం జడ్పీ పాఠశాల బైరాగిపట్టెడ రామనాయుడు పాఠశాల, కార్పొరేషన్ కార్యాలయాల్లో కౌంటర్లు ఏర్పాటు చేయనున్నారు.





