News

ముంబైపై దాడులు చేస్తామంటూ ఖలిస్థాన్ తీవ్రవాదుల హెచ్చరిక

437views

ముంబ‌యి: ముంబయి పోలీసులకు ఖలిస్థానీల నుంచి బెదిరింపు వచ్చింది. నగరంలో వారు ఉగ్రదాడులకు పాల్పడతారనే అనుమానంతో అధికారులు అప్రమత్తమయ్యారు. డిసెంబర్​ 31 పోలీసులు నగరవ్యాప్తంగా విధులు నిర్వర్తించాలని ఆదేశాలు జారీచేశారు. ఈ మేరకు పోలీసులకు సెలవులను రద్దు చేశారు.

ముంబయిలోని ప్రధాన ప్రాంతాలైన దదర్, బంద్రా చర్చ్​గేట్, సీఎస్​ఎంటీ, కుర్లా.. తదితర స్టేషన్​లలో హై అలర్ట్​ ప్రకటించారు. శుక్రవారం ఒక్కరోజే మూడు వేలమంది రైల్వే అధికారులు నగరవ్యాప్తంగా ఉన్న వివిధ స్టేషన్​లలో విధులు నిర్వర్తించనున్నట్టు ముంబయి రైల్వే అధికారి తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి