News

హెలికాఫ్టర్ ప్రమాదంపై ముగియనున్న విచారణ

614views

న్యూఢిల్లీ: తమిళనాడు హెలికాప్టర్ ప్రమాదంలో భారత త్రిదళాధిపతి జనరల్​ బిపిన్​ రావత్ దుర్మరణం చెందిన ఘటనపై రక్షణ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసిన విచారణ మరో రెండు వారాల్లో పూర్తికానుంది. భారత వైమానిక దళంలో అత్యుత్తమ ఛాపర్ పైలట్ అయిన ఎయిర్ మార్షల్ మన్వేంద్ర సింగ్​లతో పాటు ఆర్మీ, నేవీలకు చెందిన ఒక్కొక్క బ్రిగేడియర్​ ర్యాంక్​ అధికారుల నేతృత్వంలో విచారణ పూర్తి కానుంది.

ఘటన జరిగిన మరుసటి రోజు నుంచే బృందాలు విచారణ ప్రారంభించాయి. సాక్ష్యుల వాంగ్మూలాలను నమోదు చేస్తున్నాయి. ఇప్పుడు ఏర్పాటు చేసిన విచారణ కమిటీలో ఎయిర్ మార్షల్​తో పాటు విచారణలో ఉన్న ఇద్దరు అధికారులు దక్షిణ ఆర్మీ కమాండ్‌కు చెందిన వారు. వీరిరువురు ఛాపర్​ సంబంధిత విషయాల్లో నిపుణులని అధికారులు తెలిపారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి