
తిరువనంతపురం: పాలపొడి ప్యాకెట్లలో డ్రగ్స్ తరలించేందుకు యత్నించిన ఓ నైజీరియన్ను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు థామస్ కౌల్గా గుర్తించారు. అతడి నుంచి రూ.10 లక్షలు విలువ చేసే 260 డ్రగ్ పిల్స్, 110 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఓ ప్రముఖ సంస్థకు చెందిన పాలపొడి ప్యాకెట్లలో నిందితుడు గంజాయిని సరఫరా చేస్తున్నాడని అధికారులు వెల్లడించారు.
థామస్ ఇచ్చిన సమాచారం ఆధారంగా అధికారులు అంజుమ్ జంగ్ అనే మహిళకు నోటీసులు పంపారు. ప్రెస్టీజ్ గ్రూప్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డైరక్టర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న అంజుమ్ నిందితుడు వద్ద నుంచి డ్రగ్స్ కొనుగోలు చేసేదని పోలీసులు తెలిపారు. ఇదిలావుండగా, అన్నపూర్ణేశ్వరీ ఠాణా పరిధిలో ఇద్దరు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి నుంచి ఎనిమిది కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. నగరంలోని కాలేజీ విద్యార్థులకు నిందితులు గంజాయిని పంపిణీ చేస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
Source: EtvBharat





