News

ప్రధాని ట్విట్టర్ ఖాతాను హ్యాక్ చేసిన సైబర్ నేరగాళ్లు

411views

ప్రధాని నరేంద్ర మోడీ వ్యక్తిగత ట్విట్టర్‌ ఖాతాను కొందరు సైబర్ నేరస్తులు హ్యాక్‌ చేశారు. అయితే కొంతసేపటి తర్వాత ట్విట్టర్‌ యాజమాన్యం దాన్ని పునరుద్ధరించింది.

ప్రధాని మోడీ వ్యక్తిగత ట్విట్టర్‌ ఖాతాలో అగంతుకులు బిట్ ‌కాయిన్ ‌ను ప్రమోట్‌ చేస్తూ పోస్టు చేశారు. భారత్ ‌లో బిట్ ‌కాయిన్ ‌ను లీగల్‌ చేశారని, ప్రభుత్వం 500 బిట్ ‌కాయిన్‌లు కొనుగోలు చేసి, ప్రజలకు పంచుతోందని లింక్ ‌లు ట్వీట్ చేశారు. వెంటనే పీఎంఓ అధికారులు స్పందించి ట్విట్టర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో ట్విట్టర్ ప్రధాని‌ ఖాతాను పునరుద్ధరించింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి.