
568views
-
కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితికి మరో లేఖ
ఇస్లామాబాద్: కశ్మీర్ అంశంపై ఐక్యరాజ్యసమితికి పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్ ఖురేషీ మరో లేఖ రాశాడు. ఆర్టికల్ 370, కశ్మీర్ ఇతర అంశాల్లో భారత్ వెనక్కి తగ్గాలని కోరుతూ యూఎన్ జనరల్ సెక్రటరీ, యూఎన్ సెక్యురిటీ కౌన్సిల్ అధ్యక్షునికి రాసిన లేఖలో పేర్కొన్నాడు. కశ్మీర్ తమ అంతర్గత సమస్య, ఈ అంశంలో పాకిస్థాన్ తలదూర్చవద్దని భారత్ తరచుగా చెబుతున్నా.. పాకిస్థాన్ తన కుటిల నీతిని వదలడం లేదు. ఈ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై తరచూ లేవనెత్తుతోంది.





