News

హాంకాంగ్​లో చైనా మరో చట్టం

652views
  • మీడియా, ఇంటర్నెట్​పై ఉక్కుపాదం

హాంకాంగ్: హాంకాంగ్‌ పూర్తిగా చైనా ఉక్కు పిడికిట్లోకి వెళ్లిపోతోంది. హాంకాంగ్‌ సెక్యూరిటీ లా పేరిట చైనా రుద్దిన బలవంతపు చట్టం అక్కడి ప్రజల నోళ్లను మూయించేస్తోంది. నేరస్థులను చైనాకు అప్పగించే చట్టాన్ని రద్దు చేయాలంటూ ప్రజలు చేసిన ఉద్యమాన్ని చూసి భయంతో కన్నీటి పర్యంతమైన హాంకాంగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ కెరీ లామ్‌.. ఇప్పుడు విజృంభిస్తున్నారు. ఇప్పటికే భారీ సంఖ్యలో ఉద్యమకారులను అరెస్టు చేసి జైళ్లల్లో బంధిస్తున్నారు. దీంతో ప్రజలు కూడా మెల్లగా ఈ ఆంక్షలను అలవాటు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు.

స్వేచ్ఛాయుత ప్రదేశంగా హాంకాంగ్‌కు ఉన్న గుర్తింపు కనుమరుగవుతోందన్న వాస్తవాన్ని అర్థం చేసుకొని సర్దుకుపోతున్నారు. హాంకాంగ్‌ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇటీవల గ్వాంగ్జూలో మాట్లాడుతూ మరో బాంబు పేల్చారు. ఆన్‌లైన్‌లో భావప్రకటనను నియంత్రించనున్నట్టు వెల్లడించారు. ఇంటర్నెట్‌ టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ప్రస్తుత చట్టాలతో ప్రయోజనం లేదని కెరీ లామ్‌ అన్నారు.

వేర్పాటువాదం, విష ప్రచారం చేసేవారిని అరికట్టేందుకు ‘ఫేక్‌ న్యూస్‌’ చట్టాన్ని మేలో అమల్లోకి తీసుకురానున్నట్టు వెల్లడించారు. దీనిలో చట్టపరమైన అంశాలపై పరిశీలన జరుగుతోంది. దీంతోపాటు సైబర్‌ సెక్యూరిటీ లా కూడా తయారు చేయడానికి హాంకాంగ్‌ సిద్ధమైపోయింది. ఇందులో ఇంటర్నెట్‌ ప్రొవైడర్లను కీలకమైన మౌలిక సదుపాయాలుగా వర్గీకరించనున్నారు. ఫలితంగా ఆన్‌లైన్‌ కంటెంట్‌పై ప్రభుత్వానికి బలమైన పట్టు లభిస్తుందని భావిస్తున్నారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి