News

6న భారత్‌లో పర్యటించనున్న రష్యా అధ్యక్షుడు పుతిన్

611views

న్యూఢిల్లీ: రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్​ పుతిన్ డిసెంబరు ఆరోతేదీన భారత పర్యటనకు రానున్నారు. ఢిల్లీలో జరగనున్న 21వ భారత్-రష్యా వార్షిక సదస్సులో ప్రధానమంత్రి మోదీతో కలిసి పాల్గొంటారు. ఈ మేరకు విదేశాంగ శాఖ వివరాలు వెల్లడించింది. ఈ సదస్సులో భారత్​, రష్యా ద్వైపాక్షిక సంబంధాలపై కీలక చర్చలు జరుపుతారు. గతేడాది కరోనా కారణంగా సదస్సు వాయిదా పడింది. ఇప్పటివరకు ఇరు దేశాల మధ్య 20 సార్లు ఈ సదస్సు జరిగింది.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి