News

ఆర్‌ఎస్‌ఎస్‌, సేవాభారతి సేవలు అమోఘం

834views

కడప: తుపాను వల్ల తీవ్రంగా నష్టపోయిన ప్రజలకు కొద్దిరోజులుగా రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్‌, సేవాభారతి కార్యకర్తలు సహాయ సహకారాలు అందజేస్తున్నారు. మంచినీరు, ఆహార పొట్లాల పంపిణీ వంటి సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు. తాజాగా జిల్లాలోని ఎగువమందపల్లి, రాజంపేట మండలంలోని బాధితులకు సాయాన్ని అందించారు. మానవతాదృక్పథంతో కార్యకర్తలు చేస్తున్న సేవలు అమోఘమని కలెక్టర్‌ విజయరామరాజు కార్యకర్తలను అభినందించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి