News

కేంద్ర‌ మంత్రి కిషన్‌ రెడ్డి చొరవతో ఆంధ్రా యాత్రికులకు విముక్తి

505views

జమ్మూకశ్మీర్‌: సింధు పుష్కరాలకు వెళ్ళి జమ్మూకశ్మీర్‌లో చిక్కుకున్న యాత్రికులు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చొరవతో బయటపడ్డారు. హోటల్‌ నుంచి సురక్షితంగా బయటకు వచ్చారు. ఆంధ్ర రాష్ట్రంలోని శ్రీకాకుళం జిల్లా పాలకొండ, నరసన్నపేట, ఆమదాలవలస, సోంపేట, అలాగే విజయనగరం జిల్లాకు చెందిన 12 మంది చీపురుపల్లి వాసులతో కలిపి మొత్తం 240 మంది అకుల్‌ టూరిజం అనే సంస్థకు డబ్బులు చెల్లించి యాత్రకు వెళ్ళారు. మూడు రోజులు వైష్ణోదేవి ఆలయం సహా కొన్ని ప్రాంతాలు తిరిగిన తర్వాత కట్రాకు చేరుకున్నారు.

అక్కడ ఓ హోటల్లో బస చేశారు. తర్వాత ఆ టూరిజం సంస్థ వ్యక్తి కనిపించకుండాపోయాడు. బస చేసిందుకు డబ్బులు చెల్లించాలని హోటల్‌ నిర్వాహకులు అడగడంతో అసలు విషయం బయటపడిరది. మనిషికి పది వేల వంతున మొత్తం డబ్బులు కట్టేవరకూ విడిచిపెట్టేది లేదంటూ వారు వీరిని నిర్భందించారు. ఈ క్రమంలో అక్కడి సెక్యూరిటీ గార్డుతో గొడవ పడి బలవంతంగా బయటకు వచ్చి ఆందోళన చేశారు. రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. దీంతో భారీగా రాకపోకలు స్తంభించిపోయాయి. స్థానిక డీఎస్పీ అక్కడకు చేరుకుని యాత్రికులతో మాట్లాడారు.

టూరిజం సంస్థకు డబ్బులు చెల్లించామని వాళ్లే అంతా చూసుకుంటామని చెప్పి, చివరకు మోసం చేశారని పలువురు వివరించారు. ఈ విషయం కేంద్ర మంత్రి కిషన్‌ రెడ్డి దృష్టికి వెళ్ళగా, హుటాహుటిన చర్యలు తీసుకుని, ఉత్తరాంధ్ర యాత్రికులకు హోటల్‌ నుంచి విముక్తి కల్పించారు. ఈ సందర్భంగా బాధితులు కిషన్‌ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు.

Source: EtvBharat

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి