
451views
-
చైనా, టర్కీకి అందని ఆహ్వానం
వాషింగ్టన్: ప్రజాస్వామ్యంపై డిసెంబర్ 9,10 తేదీల్లో అమెరికా వర్చువల్ విధానంలో అంతర్జాతీయ సమావేశం నిర్వహించనుంది. ఈ భేటీకి 110 దేశాలకు ఆహ్వానం అందగా.. అధ్యక్షుడు జో బైడెన్ అధ్యక్షత వహించనున్నారు. చైనా, టర్కిలను ఈ సమావేశానికి దూరం పెట్టారు. తైవాన్కు పిలుపు అందింది. ఇది అమెరికా- చైనా ఉద్రిక్తతల్ని మరింత పెంచే అవకాశం ఉంది. అక్కడి విదేశాంగ శాఖ ప్రచురించిన ఆహ్వాన దేశాల జాబితాలో అమెరికా మిత్రదేశంగా భారత్ పాల్గొంటుంది. అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, శ్రీలంకకు ఆహ్వానం అందలేదు.





