News

తుపాను బాధితులకు సేవాభార‌తి సాయం

514views

నెల్లూరు: తుపాను వ‌ల్ల ఆంధ్ర‌ రాష్ట్రం తీవ్రంగా దెబ్బ‌తిన్న‌ది. వ‌రి, వాణిజ్య పంట‌లు నేల‌కొరిగిపోవ‌డంతో రైత‌న్న తీవ్ర ఆర్థిక న‌ష్టాల‌కు గుర‌య్యాడు. మ‌ట్టి ఇళ్ళు కూలిపోవ‌డం, ఇళ్ళ‌ల్లోకి వ‌ర‌ద నీరు వెళ్ళిపోవ‌డంతో సామాన్యులూ ఇక్క‌ట్లు ప‌డుతున్నారు. ఈ ప‌రిస్థితుల్లో బాధితుల‌ను దాత‌లు ఆదుకుంటున్నారు. నెల్లూరు జిల్లా, బుచ్చిరెడ్డిపాళెం ప‌రిస‌ర గ్రామాల ప్ర‌జ‌లను సేవాభార‌తి, రాష్ట్రీయ స్వ‌యం సేవ‌క సంఘ్ కార్య‌క‌ర్త‌లు చేయూత‌నందించారు. ఆక‌లితో అల‌మ‌టిస్తున్న వృద్ధులు, చిన్నారులు, ఇత‌రుల‌కు భోజ‌న పొట్లాట్ల‌ను పంపిణీ చేశారు.

 మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి