News

అందుబాటులో ఇంటర్నెట్ సేవలు

661views
  • అనుసంధాన రంగంలో పురోగతి

  • ప్రపంచంలోనే అత్యధిక డేటా వినియోగ రేటు

న్యూఢిల్లీ: భారత్‌లో స్మార్ట్‌ఫోన్‌ల వాడకం పెరుగుతుండడంతో సామాన్యులకు సైతం ఇంటర్నెట్‌ సేవలు అందుబాటులో ఉంటున్నాయి. ఈ క్రమంలో దేశంలో మొబైల్ డేటా వినియోగం రేటు ప్రపంచంలోనే అత్యధికంగా ఉందని నేషనల్‌ హెల్త్‌ అథారిటీ సీఈఓ ఆర్‌ఎస్‌ శర్మ వెల్లడించారు. ఆయన గతంలో టెలికాం రెగ్యులేటరీ ఆథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్‌) ఛైర్మన్‌గానూ వ్యవహరించారు. తాజాగా ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. దేశంలో ఇంటర్నెట్‌ వినియోగదారులు ఒక్కొక్కరు నెలకు 12 జీబీ చొప్పున వాడుతున్నారని చెప్పారు. ప్రతిష్ఠాత్మక ‘డిజిటల్‌ ఇండియా’ విజన్‌ సాకారం దిశగా.. ప్రతి త్రైమాసికంలో 25 మిలియన్ల కొత్త స్మార్ట్‌ఫోన్లు భారత్‌ మార్కెట్‌లోకి వస్తున్నాయని వెల్లడించారు.

మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తలు, విశేషాల కోసం VSK ANDHRAPRADESH యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవడానికి ఇక్కడ క్లిక్ చెయ్యండి