
614views
విశాఖపట్నం: నాలుగు రోజుల పర్యటన నిమిత్తం భారత ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖ చేరుకున్నారు. విశాఖ ఎయిర్ పోర్ట్లో జిల్లా అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం విశాఖ పోర్ట్ అతిథి గృహంలో బస చేశారు. నేడు అరకు వెళ్లే పర్యాటకుల కోసం విశాఖ నుంచి అరకుకు విస్టా డోమ్ కోచ్లతో ప్రత్యేక రైలును వెంకయ్యనాయుడు ప్రారంభించనున్నారు. ఈ రైలు సింహాచలం, కొత్తవలస, ఎస్.కోట, బొర్రా స్టేషన్లలో ఆగనుంది. తిరిగి అరకు నుంచి మధ్యాహ్నం 3.30 గంటలకు బయలుదేరి సాయంత్రం 6.45 గంటలకు విశాఖ చేరుతుంది.





