
563views
-
మోదీతో ఉన్న ఫోటోను ట్వీట్ చేసిన యోగి ఆదిత్యనాథ్
లక్నో: ఉత్తర్ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్.. తన ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసిన ఫొటోలు వైరల్గా మారాయి. ఇందులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. యోగి భుజాలపై చెయ్యి వేసి మాట్లాడుతూ కనిపించారు. అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో.. ఉత్తర్ప్రదేశ్ పర్యటనలో ఉన్న మోదీ శుక్రవారం రాత్రి నుంచి లఖ్నవూలోని రాజ్భవన్లో బస చేస్తున్నారు.
ఆదివారం ఉదయం ముఖ్యమంత్రి యోగి ఆయన్ను కలిశారు. అప్పుడే రాజ్భవన్లోని ప్రాంగణంలో మోదీ-యోగి మాటల్లో మునిగిపోయారు. ఈ సమయంలోనే మోదీ.. యోగి భుజాలపై చెయ్యి వేశారు. ఈ ఫొటోలను షేర్ చేస్తూ.. ‘నవ భారత్’ అని క్యాప్షన్ జోడించారు. యోగి ట్వీట్ రిట్వీట్ చేసిన ఉత్తరప్రదేశ్ బీజేపీ చీఫ్ స్వతంత్ర దేవ్ సింగ్ ‘సమగ్ర విజయంవైపు అడుగులు వేస్తూ..’ అని క్యాప్షన్ రాశారు.





